జలాలాబాద్: అఫ్ఘానిస్థాన్లోని జలాలాబాద్లో బ్యాంకు వెలుపల శనివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 33 మంది మరణించగా 100 మంది కిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకునుంచి జీతాలు తీసుకుంటున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు పోలీసు ప్రధానాధికారి ఫజుల్ అహ్మద్ సిర్జాద్ తెలిపారు.
గతేడాది నవంబర్ తరువాత అఫ్ఘాన్లో ఇదే అతిపెద్ద తీవ్రవాద దాడి. ఈ దాడిని అఫ్ఘాన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘనీ తీవ్రంగా ఖండించారు. దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాలిబన్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ ప్రకటించారు.