బోటు ప్రమాదంలో 36 మంది మృతి

2 Jul, 2015 14:45 IST|Sakshi

మనీలా: ఫిలిప్పీన్స్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.  అత్యధిక మంది ప్రయాణికులతో వెళుతున్న అవుట్ రిగ్గర్ బోటు గురువారం మధ్య ఫిలీప్పీన్స్ లోని ఓర్మోక్ సముద్ర జలాల్లో మునిగిపోయింది.  ఈ ఘటనలో 36 మంది మృతిచెందగా, 19 మంది అదృశ్యమైనట్లు ఆ దేశ కోస్ట్ గార్డ్ స్పష్టం చేసింది. 

 

173 మంది ప్రయాణికులతో  బయల్దేరిన ఎమ్/ బీ నివారణ్ -బీ అనే బోటు  సముద్ర తీరం నుంచి 200 మీటర్లు ప్రయాణించిన అనంతరం మునిగిపోయినట్లు పీసీజీ మానవవనరుల చీఫ్ కమాండర్ ఆర్మాండో బాలీలో తెలిపారు. ప్రమాదం నుంచి 118 మందిని రక్షించి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు