రెండు బస్సులు ఢీ: 36 మంది మృతి

6 Sep, 2014 09:19 IST|Sakshi
రెండు బస్సులు ఢీ: 36 మంది మృతి

టాంజేనియా: ఓ బస్సు మరో బస్సును వేగంగా తప్పించే క్రమంలో వేరొక బస్సును ఢీ కొట్టింది. ఆ ప్రమాదంలో 36 మంది అక్కడికక్కడే మృతి చెందగా, మరో 79 మంది గాయపడ్డారని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు. ఈ ప్రమాదం టాంజేనియాలోని మర మవంజా సరస్సు ప్రాంతంలో చోటు చేసుకుందని తెలిపారు. ఆ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ముసొమలోని ఆసుపత్రి తరలించామని చెప్పారు.

క్షతగాత్రులలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బస్సును తప్పించే క్రమంలో వేగంతో వాహనాన్ని డ్రైవర్ నిర్లక్ష్యం కారణం నడపడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు