ఆ విమానం నుంచి 38 మృతదేహాలు వెలికితీత

18 Aug, 2015 09:48 IST|Sakshi
ఆ విమానం నుంచి 38 మృతదేహాలు వెలికితీత

జకర్తా :  ఇండోనేసియా విమానం కుప్పకూలిన ప్రదేశంలో 38 మృతదేహాలను కనుగొన్నట్లు రవాణాశాఖ అధికారులు తెలిపారు. ఇందులో ఓ చిన్నారి మృతదేహం కూడా ఉన్నట్లు వివరించారు. అక్కడ వాతావరణ పరిస్థితులు సహకరించక పోవడం వల్ల మృతదేహాలను ఇప్పుడే తరలించలేక పోతున్నట్లు ఆ శాఖ అధికార ప్రతినిధి జేఏ బరాటా మీడియాకు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం పపువా రాజధాని జయపురలోని సెంటాని విమానాశ్రయం నుంచి ఓక్సిబిల్కు బయలుదేరిన ట్రిగన ఎయిర్ ఏటీఆర్ 42 అనే విమానం పుపువా ప్రాంతంలో కుప్పకూలిన విషయం తెలిసిందే. 

>
మరిన్ని వార్తలు