కాబూల్‌లో ఆత్మాహుతి దాడి : నలుగురు మృతి

31 May, 2019 15:43 IST|Sakshi

కాబూల్ : అఫ్ఘనిస్థాన్ రాజధాని  కాబూల్‌లో శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ అంతర్జాతీయ సంస్థకు చెందిన వాహనాల కాన్వాయ్‌ని లక్ష్యంగా చేసుకుని జరిపిన ఆత్మాహుతి దాడిలో నలుగురు ఆఫ్ఘన్‌లు మరణించగా, మరో నలుగురు అమెరికాసైనికులు గాయపడ్డారు. కాబూల్ నగరంలోని ఖాలా ఏ వజీర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా, గురువారం మిలటరీ ట్రైయినింగ్ అకాడమీ బయట ఐసిస్ తీవ్రవవాదులు జరిపిన బాంబు దాడిలో ఆరుగురు మరణించిన విషయం తెలిసిందే. 

మరిన్ని వార్తలు