సిరియాలో దాడి: 40 మంది మృతి

29 Apr, 2020 02:39 IST|Sakshi

అంకారా: సిరియాలో టర్కీ అనుకూల దళాల నియంత్రణలో ఉన్న ఆఫ్రిన్‌ పట్టణంలో తిరుగుబాటుదారులు చేసిన దాడిలో 40 మంది పౌరులు చనిపోయారు. రద్దీగా ఉన్న వీధిలో ఒక చమురు ట్యాంకర్‌ను పేల్చి ఈ దాడికి పాల్పడ్డారని టర్కీ విదేశాంగ శాఖ అధికారులు తెలిపారు. చనిపోయినవారిలో 11 మంది చిన్నారులున్నారని చెప్పారు. ఈ దాడిలో మరో 47 మంది గాయాలపాలయ్యారని తెలిపారు. ఈ దాడి సిరియన్‌ కుర్దిష్‌ తిరుగుబాటు దళాల పనే అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని టర్కీ అధికార వార్తా సంస్థ వెల్లడించింది.

మరిన్ని వార్తలు