కొండచరియలు విరిగి 61 మంది మృతి

20 May, 2015 02:14 IST|Sakshi

సల్గార్: కొలంబియాలో భారీ స్థాయిలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో 61 మంది మరణించారు. 37 మంది గాయపడ్డారు. విపరీతంగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో సోమవారం తెల్లవారుజాము మూడు గంటల సమయంలో ఈశాన్య కొలంబియాలోని సల్గార్ మున్సిపాలిటీ పరిధిలో పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. ఆ సమయంలో ఆ ప్రాంతవాసుల్లో అత్యధికులు గాఢనిద్రలో ఉన్నారు.

వారి ఇళ్లపై ఒక్కసారిగా కొండచరియలు విరిగిపడడంతో వాటికింద అనేకమంది జీవసమాధి అయ్యారని సల్గార్ మేయ ర్ ఓల్గా ఒసొరియో తెలిపారు. ఇళ్లు, వీధులు భారీ ఎత్తున బురద మట్టితో నిండిపోయినట్టు వివరించారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం సహాయ చర్యలు చేపట్టింది.

మరిన్ని వార్తలు