బ్రెజిల్‌ స్కూల్లో కాల్పులు.. 8 మంది మృతి

14 Mar, 2019 05:18 IST|Sakshi
ఘటనాస్థలిలో రోదిస్తున్న విద్యార్థిని

సావో పౌలో: బ్రెజిల్‌లోని సావో పౌలో నగర శివార్లలోని ఓ పాఠశాలలోకి బుధవారం ఇద్దరు దుండగులు ప్రవేశించి కాల్పులు జరిపి 6 మందిని పొట్టనబెట్టుకున్నారు. దుండగులిద్దరూ కౌమార దశలో ఉన్నవారని అధికారులు చెప్పారు. కాల్పులు జరిపిన అనంతరం వారే ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉంటారని భావిస్తున్నామన్నారు. సంఘటన స్థలంలో ఐదుగురు చిన్నారులు, ఓ టీచర్, ఇద్దరు దుండగులు సహా మొత్తం 8 మృతదేహాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో మరో 17 మంది గాయపడ్డారని బ్రెజిల్‌కు చెందిన ఓ వార్తా వెబ్‌సైట్‌ తెలిపింది.
 

మరిన్ని వార్తలు