కేప్టౌన్: దక్షిణాఫ్రికాలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేప్టౌన్ నగరం మిషెల్స్ ప్లీన్ టౌన్షిప్లోని ఓ భవనంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.