ఎయిర్పోర్ట్పై నాలుగు రాకెట్లతో దాడి

28 Aug, 2016 13:56 IST|Sakshi
ఎయిర్పోర్ట్పై నాలుగు రాకెట్లతో దాడి

టర్కీ: టర్కీ విమానాశ్రయం లక్ష్యంగా ఉగ్రవాదులు నాలుగు రాకెట్ లాంచర్లు ప్రయోగించారు. అయితే, అదృష్టవశాత్తు అవి కాస్త ఓ ఖాళీ స్థలంలో పడటంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ విషయాన్ని అక్కడి వార్తా సంస్థ డాగన్ తెలిపింది. టర్కీ నగరంలోని దియార్బకీర్ ఎయిర్ పోర్ట్ ఉంది. దీనిని లక్ష్యంగా కుర్దీష్ ఉగ్రవాదులు నాలుగు రాకెట్ లాంచర్లు ప్రయోగించారు.

అవి ఎయిర్ పోర్ట్ లోని పోలీస్ పోస్ట్ కు సమీపంలో పడ్డాయి. వీటి పేలుడు శబ్దం నగరమంతటా వ్యాపించాయి. వాటికారణంగా ఏర్పడిన దుమ్ముదూళికి పలు నివాసాలవారు కిటికీలు మూసుకున్నారు. ఘటన ప్రాంతానికి పోలీసులు వెళ్లారు. అయితే, అవి ఖాళీ స్థలంలో పడటంతో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం చోటుచేసుకోలేదు. గత మూడు దశాబ్దాలుగా కుర్దీష్ తిరుగుబాటుదారులకు భద్రతా బలగాలకు మధ్య దాడులు జరుగుతున్నాయి.

>
మరిన్ని వార్తలు