చేప మింగి.. ఫైన్ కక్కాడు!

23 May, 2016 01:53 IST|Sakshi
చేప మింగి.. ఫైన్ కక్కాడు!

లండన్: గోల్డ్‌ఫిష్ (ఓ రకమైన చిన్న చేప)ను మింగినందుకు అలెగ్జాండర్ మాకీ(21) అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌కు లండన్ కోర్టు జరిమానా విధించింది. గతేడాది అక్టోబర్‌లో టావిస్టాక్ జరిగిన  గూస్ ఫెయిర్ ఓ పోటీలో విజేతగా నిలిచిన గోల్డ్‌ఫిష్‌ను మాకీ చప్పున మింగేశాడు. ఆ దృశ్యాన్ని రికార్డు చేసిన వీడియో ఫేస్‌బుక్‌లో ఇటీవల ప్రత్యక్షమైంది.

ఈ ఉదంతంపై ‘రాయల్ సొసైటీ ఫర్ ద ప్రివెన్షన్ ఆఫ్ క్రూయాల్టీ’(ఆర్‌ఎస్‌పీసీఏ) బ్రిటిష్ కోర్టులో ఫిర్యాదు చేసింది. అతని కడుపులోనే ఆ చేప ఊపిరాడక చనిపోయినట్లు ఆర్‌ఎస్‌పీసీఏ తన నివేదికలో కోర్టుకు తెలిపింది. విచారణ జరిపిన కోర్టు మాకీకు 752 పౌండ్లు(సుమారు రూ.75వేలు) జరిమానా విధించి. అంతేకాకకుండా అతడు ఐదేళ్లు తన వద్ద చేపలు ఉంచుకోకుండా నిషేధం విధించింది.

మరిన్ని వార్తలు