భారత్కు యాపిల్ సీఈవో!

16 May, 2016 18:26 IST|Sakshi

ముంబయి/న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక యాపిల్ కంపెనీ సీఈవో టిమ్ కుక్ భారత్లో అడుగుపెట్టనున్నారు. ఈ వారంలో ఆయన భారత్ సందర్శించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అవనున్నట్లు కీలక వర్గాల సమాచారం ద్వారా తెలుస్తోంది. ఇటీవల కాలంలో ఐఫోన్ అమ్మకాలు అమాంతంగా తగ్గుముఖం పట్టడంతో ఐఫోన్ మార్కెట్కు అనుకూలమైన భారత్లో పర్యటించడం ద్వారా సంస్థకు కొంత మేలు జరగవచ్చనే అభిప్రాయంతో ఈ పర్యటన ఖరారు చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఎలాగైనా యాపిల్ సంస్థను తిరిగి పురోగతి బాట పట్టించే ఉద్దేశంతో ఉన్న కుక్ భారత్ సందర్శనకు వస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇప్పటికే చైనాలో పర్యటిస్తున్న ఆయన మంగళవారం భారత్లో అడుగుపెట్టనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ పర్యటన వివరాలు కావాలనే సదరు కంపెనీ బహిర్గతం చేయకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్లు సమాచారం. భారత్లో తొలి ఔట్ లెట్ సెంటర్ను ప్రారంభించాలని ఆపిల్ ఆలోచన చేస్తున్న నేపథ్యంలో ఈ పర్యటన ప్రాముఖ్యంకానుంది.

>
మరిన్ని వార్తలు