‘నీతి’ వైస్ చైర్మన్ పదవి గౌరవంగా భావిస్తున్నా: అరవింద్ పనగడియా

7 Jan, 2015 07:26 IST|Sakshi

న్యూయార్క్: ప్రణాళికా సంఘం స్థానంలో తీసుకొచ్చిన నీతి ఆయోగ్‌కు తొలి ఉపాధ్యక్షుడిగా తనను నియమించడాన్ని గౌరవంగా భావిస్తున్నానని ప్రముఖ భారతీయ-అమెరికన్ ఆర్థికవేత్త అరవింద్ పనగడియా అన్నారు. ‘నియమాకంతో నన్ను గౌరవించారు. ప్రధాని మోదీతోపాటు భారత్‌లోని విధానకర్తలతో పనిచేసేందుకు ఎదురు చూస్తున్నా’ అని పేర్కొన్నారు. ఆయన ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న కొలంబియా వర్సిటీ ఈమేరకు ఓ ప్రకటనలో తెలిపింది.
 

మరిన్ని వార్తలు