ఈసారి 450మందిని మింగేసింది

3 Jun, 2016 15:47 IST|Sakshi
ఈసారి 450మందిని మింగేసింది

జెనీవా/స్విట్జర్లాండ్: గ్రీస్ సముద్ర జలాల్లో మరో భారీ విషాదం చోటుచేసుకుంది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 700మందిలో సగానికిపైగా జలసమాధి అయినట్లు తెలుస్తోంది. సిరియా యుద్ధ భయంతో ఆ దేశానికి చెందిన ప్రజలంతా శరణార్థులుగా సమీప దేశాలకు ప్రాణభయంతో సముద్రాల మీదుగా వెళ్తున్న విషయం తెలిసిందే. అది కూడా పరిమితిమించిన సంఖ్యతో.

ఈ నేపథ్యంలోనే శుక్రవారం గ్రీక్ ద్వీపంలోని తీరంలో 700 మందితో వస్తున్న పెద్ద నౌక ఒకటి అనూహ్యంగా మునిగిపోయినట్లు శరణార్థుల ప్రపంచ సంస్థ ఒకటి వెల్లడించింది. కాగా, వీరిలో 250మందిని రక్షించినట్లు సమాచారం. మిగితా వందల సంఖ్యలో మునిగిపోయినట్లు తెలుస్తోంది. వీరిలో ఏ ఒక్కరు బతికి ఉన్నట్లు అధికారులు చెప్పడం లేదు.

>
మరిన్ని వార్తలు