ఆకాశంలో విమానంలో మంటలు

29 Apr, 2014 13:04 IST|Sakshi

పెర్త్: టేకాఫ్ తీసుకున్న కాసేపటికే గగనతలంలో విమానంలో మంటలు చెలరేగాయి. ఫైలట్ వెంటనే అప్రమత్తమై ఎలాంటి ప్రమాదం జరగకుండా విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. ఆస్ట్రేలియాలోని పెర్త్ విమానాశ్రయంలో మంగళవారం ఈ సంఘటన జరిగింది. ప్రమాద సంఘటనపై విచారణ జరుపుతున్నారు. కోబమ్ ఏవియేషన్ విమానం ఉదయం 10: 45 గంటలకు పెర్త్ నుంచి బయల్దేరగా.. కాసేపటికే ఓ ఇంజిన్లో మంటలు చెలరేగినట్టు కోబమ్ ఏవియేషన్ తెలిపింది. ఫైలట్ ఇంజన్ను ఆపివేయడంతో మంటలు ఆరిపోయినట్టు పేర్కొంది. వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించి పెర్త్ విమానాశ్రయంలో దించాడు. విమానంలో 93 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణికులెవరూ గాయపడలేదని కోబమ్ ఏవియేషన్ తెలియజేసింది.

మరిన్ని వార్తలు