ఫేస్బుక్పై దావా కేసు

3 Aug, 2014 12:16 IST|Sakshi
ఫేస్బుక్పై దావా కేసు

లండన్: ఆస్ట్రియాకు చెందిన న్యాయ విద్యార్థి మ్యాక్స్ స్ర్కీమ్స్ ఫేస్బుక్పై దావా కేసు దాఖలు చేశాడు. తన గోప్యతకు భంగం కలిగిందని ఆరోపిస్తూ వియన్నాలోని వాణిజ్య కోర్టును ఆశ్రయించాడు. ఫేస్బుక్లో ఉల్లంఘనకు పాల్పడిన ప్రతీ యూజర్ నుంచి  41 వేల రూపాయిలు చొప్పున తనకు ఇప్పించాలని కోర్టుకు విన్నవించాడు.

తన న్యాయపో్రాటానికి 130 కోట్లమంది ఫేస్బుక్ ఖాతాదారులందరూ మద్దతుగా నిలవాలని మ్యాక్స్ అభ్యర్థించాడు. వ్యక్తిగత వివరాలను రక్షించడంలో సోషల్ మీడియా న్యాయబద్ధంగా వ్యవహరించాలన్నదే తన ఆశయమని చెప్పాడు.
 

మరిన్ని వార్తలు