పూడ్చేసిన మూడు రోజులకు ప్రాణాలతో..

21 Apr, 2017 09:51 IST|Sakshi
పూడ్చేసిన మూడు రోజులకు ప్రాణాలతో..

ప‍్రిటోరియా‌: తాను బిడ్డకు జన్మనివ్వడం తన తల్లిదండ్రులకు తెలిస్తే ఆగ్రహిస్తారని భయపడిన ఓ తల్లి దారుణానికి ఒడిగట్టింది. గుట్టుచప్పుడు కాకుండా తాను పనిచేసేచోటనే బాలుడిని సజీవంగా పూడ్చిపెట్టింది. అయితే.. మూడు రోజుల తరువాత ఆ బాలుడు గుర్తించబడి.. ప్రాణాలతో బయటపడ్డాడు.

వివరాలు.. దక్షిణాఫ్రికాలోని క్వాజులు-నాటల్‌ ప్రావిన్స్‌లో ఉన్న ఓ టింబర్‌ ఫ్యాక్టరీలో పనిచేసే 25 ఏళ్ల మహిళకు ఇటీవల పండంటి మగబిడ్డ జన్మించాడు. అయితే.. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియకూడదని భావించి పనిచేస్తున్న చోటే.. ఫ్యాక్టరీలో దొరికిన కలప ముక్కలతో పాటు కొంత ఇసుకవేసి బాలుడిని పూడ్చివేసింది. ఆ తరువాత మూడు రోజులకు అటుగా వెళ్లిన అక్కడ పనిచేసే వారు శిశువు ఏడుపులు వినిపిస్తుండటంతో పోలీసులకు సమాచారం అందించగా.. వారు బాలుడిని కాపాడారు. ప్రస్తుతం పోర్ట్‌ షెప్‌స్టోన్‌ రీజనల్‌ ఆసుపత్రిలోని ఐసీయూలో బాలుడు చికిత్స పొందుతున్నాడని అధికారులు వెల్లడించారు. తల్లిదండ్రులకు భయపడే ఈ దుశ్చర్యకు పాల్పడ్డానని వెల్లడించిన తల్లిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు