రోహింగ్యాల కోసం 14 వేల షెల్టర్లు

16 Sep, 2017 15:44 IST|Sakshi
రోహింగ్యాల కోసం 14 వేల షెల్టర్లు

ఢాకా : మయన్మార్‌ నుంచి వలస వచ్చిన 4 లక్షల రోహింగ్యా శరణార్థుల కోసం 14 వేల తాత్కాలిక వసతి సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు బంగ్లాదేశ్‌ శనివారం ప్రకటించింది. మయన్మార్‌కు సరిహద్దు ప్రాంతమైన కుటుపాలోంగ్‌లో తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని బంగ్లా డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ సెక్రెటరీ షా కమల్‌ చెప్పారు.

ఈ షెల్టర్లలోనే 4 లక్షల రోహింగ్యా శరణార్థులకు ఆశ్రయం కల్పించడంతో పాటూ.. తాగునీరు, ఆహార, శానిటేషన్‌, వైద్య సదుపాయాలను కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఒక్కో షెల్టర్‌లో 6 నుంచి 10 కుటుంబాలు ఆవాసం ఉంటాయన్నారు.


 

మరిన్ని వార్తలు