పాక్‌లో రైలుపై బాంబు దాడి

8 Oct, 2016 04:20 IST|Sakshi

కరాచి: పాకిస్తాన్‌లోని బెలూచిస్తాన్ ఫ్రావిన్స్‌లో శుక్రవారం ఒక రైలుపై జరిపిన బాంబు దాడిలో ఆరుగురు  దుర్మరణం చెందగా, 14 మంది గాయాలపాలయ్యారు. రావల్పిండి-క్వెట్టా మధ్య ప్రయాణిస్తున్న జాఫర్ ఎక్స్‌ప్రెస్ వెళ్లే పట్టాలపై బాంబులు అమర్చి రిమోట్ కంట్రోల్‌తో పేల్చారు.

ఈ దాడులను బెలూచిస్తాన్ ముఖ్యమంత్రి నవాజ్ సనావుల్లా జెహ్రీ ఖండించారు. నిందితులను వెంటనే పట్టుకోవాలని పోలీసులను ఆదేశించారు. ఈ దాడులకు పాల్పడినట్లు ఇంతవరకు ఎవరూ ప్రకటించుకోలేదు.

మరిన్ని వార్తలు