అమెరికా కూడా మిమల్ని కాపాడలేదు

22 Sep, 2017 08:32 IST|Sakshi
అమెరికా కూడా మిమల్ని కాపాడలేదు
సాక్షి, బిజీంగ్‌ : అణు పరీక్షల నేపథ్యంలో ఉత్తరకొరియాపై ఐక్యరాజ్యసమితి విధించిన ఆంక్షలపై చైనా ఆందోళన చెందుతోంది. ఈ మేరకు చైనా అధికార మీడియా జింగ్‌ హువా వరుసగా కథనాలు ప్రసారం చేస్తోంది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే మూడో ప్రపంచ యుద్ధం రావటం తథ్యమంటూ హెచ్చరిస్తోంది.
 
‘అమెరికా, దక్షిణ కొరియాలు తమ సమాధుల్ని తామే తవ్వుకునే పనిలో నిమగ్నమయ్యాయి. అమెరికా మద్ధతు తీసుకుంటున్నప్పటికీ దక్షిణ కొరియాను ఉత్తరకొరియా భారీ నుంచి రక్షించే అవకాశమే లేదు. యాంటీ బాలిస్టిక్ మిస్సైల్ (థాడ్) వ్యవస్థను మోహరింపజేసినా.. అమెరికా, ద.కొ. సైన్యాలు ఏకమైనా ఉత్తర కొరియాను ఏం చేయలేవు. పైగా ఆంక్షలతో ఉత్తరకొరియాను ఒంటరి చేసి మరింత రెచ్చగొడుతున్నారు’ అంటూ చైనా మీడియా హెచ్చరించింది. 
 
ఇంతకీ అసలు విషయం ఏంటంటే... ఉత్తర కొరియా నుంచే చైనాకు మధ్య భారీ ఎత్తున్న వ్యాపార ఒప్పందాలు ఉన్నాయి. ఐరాస ఆంక్షల నేపథ్యంలో అధికారిక ఎగుమతి దిగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ నేపథ్యంలోనే అమెరికాను ఎండగడుతూ ఉత్తరకొరియాకు పరోక్షంగా మద్ధతు వ్యాఖ్యలు చేస్తోందన్నది స్పష్టమౌతోంది. మరోవైపు గుడ్డిలో మెల్లలా.. అణ్వాయుధ పరీక్షలు ఆపేయాలంటూ ఉత్తరకొరియాను అంతర్జాతీయ వేదికలపై చైనా డిమాండ్ చేస్తుండటం కొసమెరుపు.
మరిన్ని వార్తలు