మడిచి.. జేబులో పెట్టుకోండి!

27 Jan, 2019 01:41 IST|Sakshi

చైనా మొబైల్‌ దిగ్గజ కంపెనీ షియోమీ ఓ వినూత్నమైన స్మార్ట్‌ఫోన్‌ను తయారు చేసింది. ఇలాంటి ఫోన్లను ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగరు. మొబైల్‌ను పర్స్‌ లాగా మడుచుకుని వాడొచ్చు. సరిగ్గా మధ్యకు మూడు, నాలుగు మడతలు వేయొచ్చు. మడిచిన ప్రతిసారి కూడా స్క్రీన్‌ వస్తుంది. ఆ స్క్రీన్‌ను కూడా ఎంచక్కా వాడుకోవచ్చు. అరచేతిలో ఇమడలేనంత ట్యాబ్లెట్‌ పీసీ సైజు నుంచి చిన్న పాటి సైజు మొబైల్‌ వరకు దీన్ని మడుచుకోవచ్చు. దీన్ని షియోమీ కంపెనీ ‘చైనా ఆపిల్‌’అని ముద్దుగా పిలుచుకుంటోంది. ఈ మొబైల్‌కు ఇంకా పేరు పెట్టలేదని, ఏదైనా మంచి పేరు సూచించాలని ఈ కంపెనీ ప్రెసిడెంట్‌ లిన్‌ బిన్‌ కోరుతున్నారు. ఈ మొబైల్స్‌కు సరైన డిమాండ్‌ ఉంటే త్వరలోనే ఉత్పత్తి ప్రారంభిస్తామని ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు