బోటు బోల్తా : ఐదుగురి గల్లంతు

27 Jan, 2016 12:08 IST|Sakshi

సియోల్ : దక్షిణ కొరియాలోని దక్షిణ తీరంలో చేపల వేటకు వెళ్లిన బోటు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బోటులో ప్రయాణిస్తున్న ఐదుగురు  గల్లంతు కాగా... మరో ఐదుగురిని రక్షించినట్లు దక్షిణ కొరియా కోస్ట్ గార్డ్ వెల్లడించారు. వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ ప్రమాదం షినన్ కౌంటీలోని గాజీయో ద్వీపంలో ఈరోజు తెల్లవారుజామున చోటు చేసుకుందని చెప్పారు.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో  చేపల వేట చేస్తున్న చైనా బోటుకు చెందిన సిబ్బంది ఈ ఐదుగురిని కాపాడారని పేర్కొన్నారు. బోటు ఇంజన్ లో సాంకేతిక లోపం ఏర్పడిందని... ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని తెలిపారు.
 

మరిన్ని వార్తలు