ఎవరెస్ట్‌ కలుగులో ‘డబ్బులు’

10 Jun, 2018 12:28 IST|Sakshi

లంకెబిందెలున్నాయంటే పలుగు పారతో పరుగెత్తుకెళ్లి తవ్వుతాడు. కొండ కోనల్లో నిధి ఉందని తెలిస్తే టక్కరిదొంగలా సాహసం చేస్తాడు. డబ్బుకోసం మనిషి ఏదైనా చేస్తాడు! మనిషికి అంత ఆశ. దీనిని ఆసరాగా చేసుకుని డబ్లిన్‌లో ఆస్క్‌ ఎఫ్‌ఎం 2.0 అనే స్టార్టప్‌ కంపెనీ ఆ ఆశకు గాలం వేసింది. ప్రపంచంలోనే ఎత్తైన  ఎవరెస్ట్‌ పర్వతం లోపల దాదాపు రూ.34 లక్షల విలువైన క్రిప్టోకరెన్సీ దాచేసింది. సాహసం చేసి తీసుకొచ్చిన వారు ఆ మొత్తాన్ని తమ వెంట తీసుకెళ్లవచ్చని ప్రకటించింది.

ముగ్గురు ఉక్రెయిన్‌ పర్వతారోహకులు వాటిని సొంతం చేసుకునేందుకు పర్వతాన్ని ఎక్కారు. అయితే అందులో ఇద్దరు మాత్రమే ఆ కరెన్సీని తీసుకొచ్చారు. డబ్బునూ సొంతం చేసుకున్నారు. అయితే మూడో వ్యక్తి ఆ కరెన్సీ అన్వేషణలో ప్రాణాలు కోల్పోయాడు. తన వ్యాపారంలో భాగంగా క్రిప్టోకరెన్సీకి ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం కల్పించాలనే ఆ కంపెనీ ఈ పని చేసింది.   

మరిన్ని వార్తలు