అఫ్గాన్‌లో భద్రతా దళాల స్థావరంపై దాడిలో 24 మంది మృతి

21 Mar, 2020 02:40 IST|Sakshi

కాబుల్‌: అఫ్గానిస్తాన్‌ భద్రతా బలగాలపై కొందరు వ్యక్తులు దాడులు జరిపారు. దక్షిణ అఫ్గాన్‌లోని జాబుల్‌లో ఉన్న స్థావరంపై శుక్రవారం జరిగిన ఈ దాడుల్లో భద్రతా దళాలకు చెందిన 24 మంది మృతి చెందారు. భద్రతా దళాలు నిద్రిస్తున్న సమయంలో కొందరు వ్యక్తులు సైనికులపై దాడికి పాల్పడినట్లు అఫ్గాన్‌ అధికారులు వివరించారు. ఈ ఘటనలో అఫ్గాన్‌ ఆర్మీ దళానికి చెందిన 14 మంది, 10 మంది పోలీసులు మరణించినట్లు తెలిపారు. మరో నలుగురు అధికారుల జాడ తెలియాల్సి ఉందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు