నేపాల్లో భూకంపం

23 Aug, 2015 16:01 IST|Sakshi

ఖాట్మాండు: నేపాల్లో మరోసారి భూకంపం సంభవించింది. ఆదివారం మధ్యాహ్నం నేపాల్లోని కొడారి ప్రాంతంలో భూప్రకంపనలు వచ్చాయి.  దీంతో ప్రజలు భయంతో ఇళ్లు వదిలి బయటకు పరుగులు తీశారు.  

రిక్టార్ స్కేలుపై భూకంప తీవ్రతగా 5 నమోదైంది. కాగా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్టు సమాచారం రాలేదు. ఇటీవల వరుస భూకంపాలతో నేపాలీలు వణికిపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న నేపాల్లో సంభవించిన భూకంపంలో తొమ్మిది వేల మంది మరణించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు