న్యూగినియాలో మరోసారి భూకంపం

7 May, 2015 13:07 IST|Sakshi

సిడ్నీ:  పపువా న్యూగినియాలో మరోసారి  భూకంపం సంభవించింది. ఈ భూప్రకంపనల తీవ్రత 7.0గా నమోదు అయ్యింది. దీని ప్రభావంతో అక్కడి సముద్ర తీరం ప్రకంపనలతో వణికిపోయింది. అలలతో పోటెత్తింది. కాగా ఆస్తినష్టం, ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. మే 1వ తేదీన  కూడా న్యూగినియాలో భూకంపం సంభవించిన విషయం తెలిసిందే.

 

మరిన్ని వార్తలు