టర్కీ : టర్కీలో శనివారం విషాదం చోటుచేసుకుంది. వలసదారులుతో వెళ్తున్న పడవ మునిగి 11 మంది మృతి చెందారు. కాగా వీరిలో 8మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే చనిపోయిన వారంతా ఏ దేశం నుంచి వలస వచ్చారనేది తెలియాల్సి ఉంది. ఈ ఘటన పశ్చిమ టర్కీలోని ఈజియన్ ప్రావిన్స్ ఇజ్మీర్ తీరంలో చోటుచేసుకున్నట్లు టర్కీ కోస్టు గార్డ్ వర్గాలు తెలిపాయి. కాగా ప్రమాదం జరిగిన సమయంలో పడవలో మొత్తం 19మంది ప్రయాణిస్తున్నారు. సమాచారం అందుకున్న కోస్ట్గార్డ్ సిబ్బంది ఎనిమిది మందిని రక్షించి ఆసుపత్రికి తరలించారు.