ఆగని హింస ; సోషల్‌ మీడియాపై నిషేధం

7 Mar, 2018 16:20 IST|Sakshi
క్యాండీలోని దిగనాలోలో ముష్కరులు ధ్వంసం చేసిన ఇళ్లు.

కొలంబో : ఎమర్జెన్సీ కొనసాగుతున్నప్పటికీ శ్రీలంకలో హింస ఆగలేదు. బుధవారం నాడు కూడా క్యాండీలోని పలు చోట్ల బౌద్ధులు-ముస్లింల మధ్య ఘర్షణలు జరిగాయి. బౌద్ధ సంఘాలకు చెందిన యువకులు కొందరు.. మసీదులను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారు.

అల్లర్లు నానాటకీ వ్యాప్తి చెందుతుండటంతో ఫేస్‌బుక్‌, వాట్సప్‌ సహా ఇతర సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌లపై నిషేధం విధించారు. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ప్రభుత్వ వర్గాలు ప్రకటన చేశాయి. అయితే, నిషేధం ఎంతకాలం ఉంటుందనేది స్పష్టంగా తెలియరాలేదు. క్యాండీ జిల్లాల్లో చెలరేగిన హింసను అదుపుచేయడంలో భాగంగా మంగళవారం నుంచి 10 రోజులపాటు ఎమర్జెన్సీని విధించిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు