'మాకు పాపే పుడుతుంది.. ఈసారి కలిసొస్తుంది'

1 Aug, 2015 11:28 IST|Sakshi
'మాకు పాపే పుడుతుంది.. ఈసారి కలిసొస్తుంది'

న్యూయార్క్ : తనకు పాప పుడుతుందని ఫేస్బుక్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ జూకర్బర్గ ఆశాభావ్యక్తం చేశారు. తన భార్యతో దిగిన ఓ ఫొటో అప్ లోడ్ చేసి ఈ విషయాన్ని ఫేస్ బుక్ వెబ్సైట్లో శుక్రవారం ఆయన పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు విపరీతమైన స్పందన వచ్చింది. పోస్ట్ చేసిన 9 గంటల్లోపే లక్షమందికి పైగా యూజర్లు లైక్ కొట్టగా, 70 వేల మంది కామెంట్ చేశారు. ఈ పోస్టు 28 వేల సార్లు షేర్లు చేశారని తెలిపారు. తన భార్య ప్రిస్సిల్లా చాన్ కూడా తమ ఇంట్లోకి వచ్చేది పాపే అని అనుకుంటుందన్నారు. ఇక ఇప్పటి నుంచి తమ పిల్లల కోసం, తర్వాతి తరాల కోసం ఏదైనా చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు.

తన భార్యను కలవడానికి వెళ్లినప్పడు చాలా ఉద్వేగానికి లోనయినట్లు జూకర్బర్గ్ తన సైట్లో రాసుకొచ్చారు. పిల్లల విషయంలో ఈ దంపతులు గతంలో  మూడుసార్లు నిరాశకు గురైన విషయం తెలిసిందే. సమస్యలు వచ్చినప్పుడు తమ మధ్య బంధం మరింత బలపడుతుందని.. ప్రేమ మరింత ఎక్కువవుతుందని ఆయన పోస్టు చేశాడు. ఈసారైనా తమ ఆశలు ఫలించవచ్చని ఆయన ఆశగా ఎదురుచూస్తున్నారు. దీంతో తమ జీవితంలో నూతన అధ్యాయం మొదలైనట్లేనని, గతంతో పోలిస్తే ఈ సారి తన భార్య, కడుపులో బిడ్డ కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పుకొచ్చారు. 

మరిన్ని వార్తలు