విమానంలో అగ్ని ప్రమాదం.. 41 మంది మృతి

6 May, 2019 07:55 IST|Sakshi

మాస్కో : అకస్మాత్తుగా విమానంలో చెలరేగిన మంటల్లో దాదాపు 41 మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా రాజధాని మాస్కోలో విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ విమానంలో సిబ్బందితో పాటు 78 మంది ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. మాస్కో నుంచి బయల్దేరిన ఈ విమానం.. టేకాఫ్‌ అయిన కొద్ది నిమిషాలకే అత్యవసర ల్యాండింగ్‌ వల్ల నేలకు బలంగా తాకింది. దీనివల్లే విమానంలో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన సంభవించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు