పాక్లో కాల్పులు : ఐదుగురు మృతి

30 Jul, 2015 13:10 IST|Sakshi

పెషావర్: పాకిస్థాన్ బన్ను జిల్లాలో గురువారం కడిమ్ భద్రత దళ చెక్పోస్ట్పై దుండగులు దాడి చేసి... విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. దాంతో అప్రమత్తమైన భద్రత దళాలు ఎదురుకాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో మొత్తం ఐదుగురు మరణించారని మీడియా వెల్లడించింది.

వారిలో ముగ్గురు దుండగులు కాగా ... మరో ఇద్దరు భద్రత దళానికి చెందిన వారని పేర్కొంది. ఈ కాల్పులకు తెగబడింది ఉగ్రవాదులుగా అనుమానిస్తున్నామని పోలీసులు వెల్లడించారని మీడియా తెలిపింది. కాల్పుల వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారని మీడియా చెప్పింది.

మరిన్ని వార్తలు