అఫ్ఘానిస్థాన్‌లో వరదలు.. 20 మంది మృతి 

3 Mar, 2019 21:58 IST|Sakshi

వేలాది ఇళ్లు నేలమట్టం 

కాందహార్‌ : దక్షిణ అప్ఘనిస్థాన్‌లోని కాందహార్‌ ప్రావిన్స్‌ను వరదలు ముంచెత్తాయి. భారీ వర్షాలు, వరదల కారణంగా 20 మంది ప్రాణాలు కోల్పోయారు. వేలాది ఇళ్లు నేలమట్టం కాగా వరద నీటిలో పలు వాహనాలు కొట్టుకుపోయాయి. ఈ విషయాన్ని వెల్లడించిన ఐక్యరాజ్యసమితి కార్యాలయం అధికారులు.. గడిచిన 30 గంటల్లో భారీ వర్షపాతం నమోదైనట్లు తెలిపారు. వరదల్లో కనీసం 20 మంది ప్రాణాలు కోల్పోయారన్న యూఎన్‌వో.. మరోపది మంది గల్లంతైనట్లు వెల్లడించింది. వరదలతో 2 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, శుక్రవారం నుంచి దాదాపు 400 కుటుంబాలను సైనికులు రక్షించినట్లు కాందహార్‌ డిప్యూటీ గవర్నర్‌ తెలిపారు.  

>
మరిన్ని వార్తలు