లండన్‌లో ఘనంగా వినాయక నిమజ్జనం

13 Sep, 2016 21:07 IST|Sakshi


లండన్‌లో మంగళవారం ఉదయం తెలంగాణ వాసులు ఘనంగా వినాయక నిమజ్జనోత్సవం జరుపుకున్నారు. హైదరాబాద్ ఫ్రెండ్స్ యూత్ లండన్ ఆధ్వర్యంలో నగర వీధుల్లో నృత్యాలతో గణేశుని విగ్రహ శోభాయాత్ర సాగింది. ఈ వేడుకల్లో ఇతర రాష్ట్రాల వారితో పాటు లండన్ వాసులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఎన్నారై తెలంగాణ ఫోరం ఫౌండర్ అనిల్ కూర్మాచలం, వైస్‌ప్రెసిడెంట్ పవిత్రా రెడ్డి దంపతులు తదితర ప్రముఖులు హాజరై ప్రత్యేక పూజలు జరిపారు. గణేశుని చేతిలో ఉంచిన లడ్డూను తక్కళ్లపల్లి శ్రీధర్‌రావు దంపతులు 601 పౌండ్లకు వేలంలో దక్కించుకున్నారు. కాగా, ఈ పూజ కోసం లడ్డూను తయారు చేసిన లక్ష్మి చిన్నం గారిని నిర్వాహకులు అభినందించారు.

కార్యక్రమంలో కుడుదుల రత్నాకర్, నవీన్‌రెడ్డి, మల్లారెడ్డి, సుష్మన, రాజు నాగార్జున, ధర్మ, గరిపెల్లి నాగరాజు, పింగిలి సత్యరెడ్డి, శివ చిన్నం, లక్ష్మి చిన్నం, శివరామ గుప్త, సత్య, అపర్ణ, వెంకట్‌రెడ్డి, విక్రం రెడ్డి, సుమ, శారదా ప్రసాద్ పెండ్యాల తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు