పైలట్‌ చాకచక్యం.. తప్పిన ప్రమాదం

13 May, 2019 09:55 IST|Sakshi

యాంగాన్‌ : పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించి ఏడుగురు విమాన సిబ్బంది సహా మొత్తం 89 మంది ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన మయన్మార్‌లోని మాండలే అంతర్జాతీయ విమానాశ్రయంలో చోటుచేసుకుంది. విమానంలో సాంకేతికలోపంతో ముందు భాగంలోని టైరు తెరచుకోలేదు. దీంతో రన్‌ వేపై పైలట్‌ ఆ విమానాన్ని దింపుతున్న సమయంలో ముందు భాగం రోడ్డును తాకింది. పైలట్‌ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రయాణికులతోపాటు సిబ్బందికి గాయాలు కాలేదు.

యూబీ 103 విమానంలో  ఆదివారం ఉదయం సాంకేతిక సమస్య తలెత్తడంతో  ఈ ఘటన చోటు చేసుకుంది. ‘ముందు భాగంలోని టైరు తెరుచుకోకపోవడంతో వెనకవైపున ఉండే టైర్ల సాయంతో మాత్రమే విమానాన్ని దించాల్సి వచ్చింది. పైలట్‌ తన నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ విమానాన్ని సురక్షితంగా దించారు’ అని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు