వడ్డించిన చేపకు ప్రాణమొచ్చింది..

15 Oct, 2015 18:56 IST|Sakshi
వడ్డించిన చేపకు ప్రాణమొచ్చింది..

బిర్యానీలో కోడి.. కూతపెడితే.. అలాగే ప్లేట్లో ఉన్న చేప ఎగిరిపడితే.. వినడానికే షాకింగ్గా ఉంది కదూ.. జపాన్లో ఓ జంటకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. జపాన్లో సషిమి చేపలు బాగా పాపులర్. వీటిని పచ్చిగానే తింటారు. అయితే తమ కస్టమర్స్కి ఫ్రెష్ చేపలు పెడుతున్నామనే విషయాన్ని లైవ్లో ప్రూవ్ చేయాలనుకున్నారో ఏమో. ఓ రెస్టారెంట్లో ఫిష్ ఆర్డర్ చేసిన ఆ జంటకు బతికి ఉన్న చేపనే వడ్డించారు.

నోరూరించే.. సషిమిని ఓముక్క కొరికి ప్లేట్లో పెట్టి మాట్లలో పడిపోయిన కస్టమర్స్... తాము తిన్న చేప బతికే ఉందని తెలుసుకుని షాకయారు.. ప్లేట్లో ఉన్న చేప.. ఉన్నట్టుండి కదలటం మొదలుపెట్టి  కాసేపయ్యాక.. ఏకంగా ప్లేట్లోంచి జంప్ చేసింది. దీంతో ఆర్డర్ ఇచ్చిన ఆసామితో పాటు... చుట్టుపక్కల వాళ్లు భయంతో కేకలు పెట్టారు. ఈ మొత్తం ఎపిసోడ్ను ఓ వ్యక్తి  తన సెల్ఫోన్లో బంధించి ట్విట్టర్లో పోస్టు చేశాడు.

ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే రెండు వేల మందికి పైగా ఈ వీడియోపై కామెంట్స్ చేశారు. 20 సెకండ్ల ఈ వీడియోని ప్రపంచవ్యాప్తంగా.. 20లక్షల మంది వీక్షించారు.