31న నవాజ్ షరీఫ్‌కు గుండె శస్త్రచికిత్స

28 May, 2016 01:20 IST|Sakshi

ఇస్లామాబాద్: పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌కు మంగళవారం లండన్‌లో గుండె శస్త్రచికిత్స చేయనున్నారని ఆ దేశ రక్షణ మంత్రి ఖ్వాజా అసిఫ్ తెలిపారు. తప్పనిసరిగా శస్త్రచికిత్స చేయించుకోవాలన్న వైద్యుల సలహా మేరకే ఈ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ జరుగుతోందని చెప్పారు. శస్త్రచికిత్స కోసం వారంపాటు షరీఫ్ ఆస్పత్రిలోనే ఉంటారని, వైద్యుల అనుమతితోనే తిరిగి వస్తారని ఆయన తెలిపారు. షరీఫ్ కుమార్తె మర్యం నవాజ్ కూడా ట్విటర్‌లో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. తన తండ్రి కోసం ప్రార్థించాలని, అప్పుడే ఆయన ఆరోగ్యంగా ఉంటారంటూ ఆమె ట్వీట్ చేశారు.

మరిన్ని వార్తలు