ఇస్లామాబాద్లో పరిస్థితి ఉద్రిక్తం

20 Aug, 2014 11:44 IST|Sakshi

కరాచీ: పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ రాజీనామా చేయాలన్న డిమాండ్ ఆ దేశంలో రోజురోజూకు తీవ్రమవుతుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇస్లామాబాద్ నగరంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకంగా నిరసనకారులు ఆందోళనలు మిన్నంటాయి. ఈ ఆందోళనలో వేలాది మంది ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని నవాజ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలనే డిమాండ్లతో ఇస్లామాబాద్ మారుమోగుపోతుంది. దాంతో ఇస్లామాబాద్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఇస్లామాబాద్లో అత్యవసర పరిస్థితిని ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని వార్తలు