వేల మంది ప్రాణాలు తీసిన ఫోన్‌ వేలం

18 Feb, 2017 10:18 IST|Sakshi
వేల మంది ప్రాణాలు తీసిన ఫోన్‌ వేలం

చెసాపెకే సిటీ: చరిత్ర ఎన్నటికీ మరచిపోని నియంత అడాల్ఫ్‌ హిట్లర్‌. ఆయన వినియోగించిన పర్సనల్‌ ట్రావెలింగ్‌ ఫోన్‌ వేలానికి వచ్చింది. చెసాపెకే సిటీల జరగనున్న అలెగ్జాండర్‌ హిస్టారికల్‌ వేలంలో రెడ్‌ ఫోన్‌ను వేలం వేయనున్నారు. రెడ్‌ ఫోన్‌పై హిట్లర్‌ పేరు కూడా ఉంది. హిట్లర్‌ ఈ ఫోన్‌లో మాట్లాడటం ద్వారా వేలాది మంది ప్రాణాలు బలిగొన్నారని వేలం నిర్వహకులు తెలిపారు. ఈ వారాంతంలో జరగనున్న వేలంలో రెడ్‌ ఫోన్‌కు కనీసం రెండు నుంచి మూడు లక్షల అమెరికన్‌ డాలర్లు ధర పలుకుతుందని భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు