న్యూయార్క్లో ప్రారంభమైన జీ4 దేశాల సదస్సు

26 Sep, 2015 18:11 IST|Sakshi

న్యూయార్క్ :  భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జీ4 సదస్సులో పాల్గొన్నారు. న్యూయార్క్లో జరుగుతున్న ఈ సదస్సులో సభ్యదేశాలుగా ఉన్న  బ్రెజిల్, జర్మనీ, జపాన్, భారత్‌ దేశాల అధినేతలు పాల్గొన్నాయి. ఐక్యరాజ్య సమితిలో తీసుకు రావాల్సిన సంస్కరణలపై చర్చ సందర్భంగా....  ఐరాసలో సంస్కరణలు వేగవంతం చేయాలని ఈ సందర్భంగా మోదీ సూచించారు. ఐరాసలో సంస్కరణలపై దశాబ్దాలుగా జరుగుతున్న చర్చలకు ముగింపు పలకాలని ఆయన అన్నారు.


 

మరిన్ని వార్తలు