స్మార్ట్ఫోన్ల మీద పెద్దవాళ్లకి చాలా కోపం ఉండవచ్చు. వాటి వినియోగం మీద, వాటి వినియోగదారుల మీద లెక్కలేనన్ని జోకులు, చతురోక్తులు ఉండవచ్చు. అవి దుర్వినియోగమవుతున్న సంగతి కూడా తెలియనిది కాదు. అవి స్నానాల గదులలోకి, కొండొకచో పడకగదులలోకి చాటుగా చూసి కొంటె పనులు కూడా చేస్తున్నాయనీ తెలుసు. కానీ వాటిని నిరోధిం చడం, వాటి జోలికి పోకుండా ఉండటం ఎవరి వల్లా కావడం లేదు.
స్వతంత్ర సాంకేతిక విశ్లేషకుడు కానలస్ జరిపిన సర్వే ప్రకారం ఇప్పుడు భారత్ స్మార్ట్ఫోన్ల వినియోగంలో ఉన్నత శిఖరాలకి చేరిపోయింది. అమెరికాను కూడా స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో మనం దాటే శాం తెలుసా! చైనాను కూడా వెనకబడిపోయేటట్టు చేసేశాం కూడా. ఇంతగా ఎందుకు మార్కెట్ పెరిగిం దంటే ఇక్కడ వాటి మార్కెటింగ్ చాలా సులభమట. మనకి మోజు కూడా ఎక్కువే కదా!