టాప్‌–3లో భారత్‌

28 Apr, 2020 04:47 IST|Sakshi

భారత్‌ సైనిక వ్యయం 71.1 బిలియన్‌ డాలర్లు

లండన్‌: ప్రపంచ దేశాల సైనిక వ్యయం గత పదేళ్లలో 2019లోనే భారీగా పెరిగిందని ఓ అధ్యయనం తేల్చింది. ఆయుధాల కోసం అత్యధికంగా నిధులు వెచ్చించిన మొదటి మూడు దేశాల్లో మొట్టమొదటిసారిగా ఆసియాలోని చైనా, భారత్‌ ఉన్నాయని తెలిపింది. ఈ మేరకు స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌(సిప్రి) అనే సంస్థ ఓ నివేదికను వెలువరించింది. ప్రపంచ దేశాల్లో ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక సంక్షోభం, కరోనా వ్యాప్తి కారణంగా మున్ముందు సైనిక వ్యయం తగ్గే అవకాశాలున్నాయని అంచనా వేసింది.

► 2019లో ప్రపంచ దేశాల సైనిక వ్యయం 1,917 బిలియన్‌ డాలర్లు. 2018తో పోలిస్తే ఇది 3.6 శాతం ఎక్కువ.  

► మొత్తమ్మీద టాప్‌–5 దేశా(అమెరికా, చైనా, భారత్, రష్యా, సౌదీ అరేబియా)ల వ్యయం 62 శాతంగా ఉంది.

► సైనిక వ్యయం ఎక్కువచేస్తున్న దేశాల్లో అమెరికా టాప్‌లో ఉండగా, చైనా, భారత్‌ 2, 3 స్థానాల్లో, రష్యా నాల్గో స్థానంలో నిలిచాయి.  

► ప్రపంచ దేశాల సైనిక వ్యయంలో అమెరికా వాటా 38 శాతం. 2019లో అమెరికా సైనిక వ్యయం అంతకు ముందు ఏడాది కంటే 5.3 శాతం పెరిగి 732 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.  

► 2019లో చైనా సైనిక వ్యయం 261 బిలియన్‌ డాలర్లు కాగా, 2018తో పోలిస్తే ఇది 5.1శాతం ఎక్కువ. అదే భారత్‌ విషయానికొస్తే 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది.  

► ఆసియాలో శక్తివంతమైన జపాన్‌ 47.6 బిలియన్‌ డాలర్లు, దక్షిణకొరియా 43.9 బిలియన్‌ డాలర్లు సైనికపరంగా వెచ్చించాయని సిప్రి తెలిపింది.

మరిన్ని వార్తలు