-

భారత సంతతి మేయర్ అభ్యర్థిపై జాతి విద్వేషం

26 Sep, 2013 01:31 IST|Sakshi

న్యూయార్క్: న్యూజెర్సీలోని ఎడిసన్ మేయర్ పదవికి పోటీ పడుతున్న భారత సంతతి అభ్యర్థులు జాతి విద్వేషాన్ని చవిచూశారు. ప్రచారం కోసం ఏర్పాటు చేసిన సైన్‌బోర్డులపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్వస్తిక్ గుర్తులతో పాటు ‘నెవర్ ఇన్ ఎడిసన్’ అంటూ విద్వేషపూరితమైన రాతలు రాశారు. ఎడిసన్ మేయర్ పదవికి పోటీ పడుతున్న సుధాంశు ప్రసాద్‌తో పాటు ఈ ఎన్నికల్లో ఇతర పదవుల కోసం భారత సంతతి అభ్యర్థులు షీలా ఆంగాలెట్, మోహిన్ పటేల్, స్టీవెన్ నాగెల్, సింథియా దోహర్తీలు పోటీచేస్తున్నారు.

మరిన్ని వార్తలు