జర‍్మనీలో భారతీయ జంటపై దాడి : భర్త మృతి

30 Mar, 2019 11:35 IST|Sakshi

మ్యూనిచ్‌ : జర్మనీలో భారతీయ దంపతులపై  ఒక వలసదారుడు దాడికి తెగడ్డాడు. కత్తితో దాడి చేయడంతో  భర్త ప్రశాంత్‌ ప్రాణాలు కోల్పోగా, భార్య స్మిత ఆసుపత్రిలో చిక్సిత పొందుతున్నారు.  జర్మనీలోని మ్యూనిచ్‌ వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్వయంగా  విదేశాంగ మంత్రి సుష్మస్వరాజ్‌ ట్విటర్‌లో వెల్లడించారు.  ప్రశాంత్‌ సోదరుడిని జర్మనీకి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ట్వీట్‌ చేశారు.  అలాగే వారి ఇద్దరి  పిల్లల భద‍్రతపై అధికారులకు  తగిన సూచనలు  చేసినట్టు తెలిపారు.  బాధిత కుటుంబానికి సుష్మా సంతాపం వెలిబుచ్చారు.  ఈ ఘటనపై  పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

మరిన్ని వార్తలు