అమెరికాలో తెలుగు యువకుడు మృతి

30 May, 2018 04:40 IST|Sakshi

న్యూయార్క్‌: స్నేహితులతో కలిసి సరదాగా గడిపేందుకు వెళ్లిన ఓ తెలుగు వ్యక్తి∙ప్రమాదవశాత్తు మృతి చెందారు. కాలిఫోర్నియాలోని యోస్‌మైట్‌ నేషనల్‌ పార్క్‌లో ఈ ప్రమాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆశిష్‌ పెనుగొండ(29) న్యూయార్క్‌లో ఉంటున్నారు. ఈనెల 21న ఆశిష్‌ స్నేహితులతో కలిసి నేషనల్‌ పార్క్‌కు వెళ్లారు. పార్క్‌లో ఉన్న హాఫ్‌డోమ్‌ అనే గ్రానైట్‌ కొండను తోటి వారితో కలిసి ఎక్కేందుకు ప్రయత్నించారు. బాగా ఏటవాలుగా ఉండే ఆ కొండపైకి రెండు చేతులతో తాళ్లు పట్టుకుని నడుస్తూ ఎక్కుతుండగా గాలివాన మొదలైంది. ఆ క్రమంలోనే ఆశిష్‌ కాలుజారి కొండపై నుంచి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన ఆశిష్‌ అక్కడికక్కడే చనిపోయారు. ఫెయిర్లీ డికిన్సన్‌ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్‌ చేసిన ఆశిష్‌ న్యూజెర్సీలోని న్యూమిల్‌ఫోర్డ్‌ కేంద్రంగా ఉన్న సీమెన్స్‌ హెల్త్‌కేర్‌ కంపెనీలో బయోకెమిస్ట్‌గా పనిచేస్తున్నారు.

మరిన్ని వార్తలు