భారత్‌తో సంబంధాలపై అమెరికా తీర్మానం

30 Jan, 2015 03:00 IST|Sakshi

వాషింగ్టన్: 21వ శతాబ్దంలో సుస్థిరత, సౌభాగ్యం, ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే భారత్, అమెరికాల మధ్య సత్సంబంధాలు కొనసాగాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంటూ అమెరికా పార్లమెంటులో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతినిధుల సభలో జనవరి 27న డెమొక్రాటిక్ పార్టీ సీనియర్ నేత జోసెఫ్ క్రోలీ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. రెండు దేశాల్లోనూ ప్రజాస్వామ్య విలువలు వేళ్లూనుకొని ఉన్నాయని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి ఇరుదేశాలు కృషి చేయడం ఇకపైనా కొనసాగించాలని అందులో పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు