ఇండోనేషియాలో వర్షాలకు 26 మంది మృతి

22 Sep, 2016 14:25 IST|Sakshi

జకర్తా: ఇండోనేషియాలోని జావా ద్వీపంలో కురిసిన భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి, వరదలు వచ్చి 26 మంది చనిపోయారు. మరో 19 మంది గల్లంతయ్యారని అధికారులు తెలిపారు. మంగళవారం రాత్రి రెండు నదులు ఉప్పొంగడంతో ఒక్క గారట్‌ జిల్లాలోనే 17 మంది మరణించగా, 13 మంది కనిపించకుండా పోయారు.

చనిపోయిన వారిలో 8 నెలల పసికందుతోపాటు 8 మంది చిన్నపిల్లలున్నారని అధికారులు గురువారం వెల్లడించారు. ఇండోనేషియాలో జూన్ లో కురిసిన భారీ వర్షాలకు 50 మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.

మరిన్ని వార్తలు