కరోనా కల్లోలం: అక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు

11 Mar, 2020 16:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనా కల్లోలం, ఇరాన్‌లో పిట్టల్లా రాలుతున్న జనం

బుధవారం మరో 63 మంది మృతి

మొత్తం కేసులు  9 వేలు

ఇరాన్‌లో కోవిడ్‌-19 (కరోనా వైరస్‌) బాధితులు  పిట్టల్లా  రాలిపోతున్నారు. అంతకంతకూ విజృంభిస్తున్న కరోనా బుధవారం ఒక్క రోజే మరో 63 మందిని పొట్టన పెట్టుకుంది. దీంతో తమ దేశంలో ఈ మహమ్మారి బారిన పడి మరణించిన వారి సంఖ్య 354 కు చేరిందని  ఆరోగ్య అధికారులు ప్రకటించారు. దురదృష్టవశాత్తు గత 24 గంటల్లో కరోనా వైరస్ కారణంగా 63 కొత్త మరణాలు సంభవించాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ కియానౌష్ జహాన్పూర్  వెల్లడించారు. అలాగే దేశంలో 958  కొత్తగా కోవిడ్ -19 కేసులను గుర్తించామని తెలిపారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 9 వేలకు చేరుకుందన్నారు. 

చదవండి :  కరోనా : మహిళ పరిస్థితి విషమం

మరిన్ని వార్తలు