300 మందికిపైగా కిడ్నాప్

8 Apr, 2016 13:44 IST|Sakshi

డెమాస్కస్ : ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. అబు అల్ షమత్ ప్రాంతంలో 300 మందిని ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. ఈ మేరకు మీడియా శుక్రవారం వెల్లడించింది. కిడ్నాప్ అయిన వారంతా అల్ బడేహి సిమెంట్ కంపెనీలో పని చేస్తున్న కార్మికులని వివరించింది. కార్మికులు కిడ్నాప్ అయిన విషయం తెలిసిన వెంటనే ఆ సిమెంట్ కంపెనీ యాజమాన్యంతో పరిశ్రమల మంత్రిత్వశాఖ మాట్లాడినట్లు పేర్కొంది. అయితే దీనిపై సదరు కంపెనీ... స్పష్టమైన సమాచారం ఇవ్వలేదని తెలిసింది.  
 

మరిన్ని వార్తలు