కాబూల్: అఫ్ఘనిస్థాన్ రాజధానిలో కాబూల్లో మంగళవారం బాంబు పేలుడు జరిగింది. అమెరికా ఎంబసీ కార్యాలయ సమీపంలో ఈ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా మరో 8 మందికి గాయాలయ్యాయి. పేలుడు జరిగిన ప్రాంతంలో అమెరికా ఎంబసీతో పాటు పలు దేశాల రాయబార కార్యాలయలున్నాయి.