కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 29 మంది మృతి

22 Mar, 2018 02:58 IST|Sakshi

కాబూల్‌: అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌ మరోమారు రక్తమోడింది. షియా ముస్లింలు పర్షియన్‌ నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా.. జరిగిన ఆత్మాహతి దాడిలో కనీసం 29 వరకు మృతి చెందారు. ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మరో 52 మంది వరకు గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘కాబూల్‌ యూనివర్సిటీ, ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో ఈ దాడి జరిగింది. పోలీసు తనిఖీలకు చిక్కకుండా వెళ్లిన ఉగ్రవాది.. అక్కడ తనను తాను పేల్చేసుకున్నాడు’ అని వెల్లడించింది. 

మరిన్ని వార్తలు